Monday, 23 May 2016

మహేష్ బాబుకి కుచ్చు టోపీ పెట్టేసారు ఏకంగా..?

freshdeals365

ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క హిట్ ఇచ్చిన కాంబినేషన్ లో మళ్లీ మళ్లీ మన తెలుగు హీరో లు సినిమాలు చేయడానికి  ఎందుకు ఆసక్తి చూపిస్తారు. స్టార్ ఇమేజ్ ఉన్న బడ బడ పెద్ద పెద్ద  హీరోలు కూడా సక్సెస్ ఇచ్చిన దర్శకులతో కలిసి పనిచేయడానికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు  చూపిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రస్తుతం అదే బాటలో తనకు ఒక హిట్ సినిమా ఇచ్చిన దర్శకులకు సెకండ్ చాన్స్ ఇచ్చి చూశాడు. కానీ మహేష్ బాబు సెకండ్ చాన్స్ ఇచ్చిన దర్శకులందరూ నెగెటివ్ రిజల్ట్ తో మహేష్ కు షాక్ ఇచ్చారు.
ఒక్కడు సినిమాతో మహేష్ కు స్టార్  అనే ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు గుణశేఖర్. అదే ఆలోచనతో తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు గుణ శేఖర్ గారి డైరెక్షన్లో  చేశాడు మహేష్. కానీ ఆ రెండు సినిమాలు ఆశించినట్లుగా ఫలితాన్నిఅయితే ఇవ్వలేక పోయాయి. మహేష్ బాబు కెరీర్ లో మరో మెమరబుల్ మూవీ అతడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి  పాజిటివ్ టాక్ రావటంతో అదే కాంబినేషన్ లో ఖలేజా సినిమా  ఆత్రంగా ఆవేశంతో చేశాడు మన మహేష్. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తో నిరాశ పరిచింది.

రీసెంట్ గా శ్రీను వైట్ల కూడా అదే రూట్లో వెళ్లి మల్లి చెదు అనుభవాన్నే మిగిల్చాడు అని మహేష్ బాబు బాధపడుతున్నాడు. దూకుడు సినిమాతో మహేష్ కెరీర్ కు మంచి బూస్ట్ అప్ ఇచ్చిన శ్రీను, ఆ తరువాత  వచ్చిన ఆగడు సినిమాతో అదే స్థాయిలో ఫ్లాప్ ఫ్లోప్ ఫ్లోప్ అని జనాల గుండెల్లో మర్చిపోలేని బాధను మిగిల్చాడు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల విషయంలో మల్లి  అదే  విషయం ఇప్పుడు ఋజువైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కూల్ హిట్ సినిమా ఇచ్చిన ఈ దర్శకుడు బ్రహ్మోత్సవం సినిమాతో మల్లి నిరాశ  పరిచాడు మహేష్ ని అని ఫీల్ అవుతన్నాడు.
 
అయితే ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు  మన పూరి జగన్నాథ్ మాత్రమే, మహేష్ తో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్  సినిమా హిట్ అందించిన పూరి, తరువాత బిజినెస్ మేన్ సినిమాతో మరో హిట్ అందించాడు.అందుకు ఇప్పుడు మహేష్ మల్లి పూరి ని నమ్ము కుంటాడ లేక ఎం చేస్తాడో మనము వెయిట్ చేసి చూద్దాం.

0 comments: